25 October 2011

ఎందుకంటే

విషయాలు ఇక్కడదాకా వచ్చాయి

రాత్రుళ్ళు సూర్యసింహాన్ని
ఖైదు చేసింది ఎవరు?

అతడు ఆనాడు పిల్లలకి
తాబేలును చూపించాడు
పిల్లలు దానిని ఆకుపచ్చ
చేప అని అనుకున్నారు

అతడు అన్నాడు: నేలపై
నీటిలో బ్రతుకగలదు అది.

వాళ్ళు అన్నారు: మరి అది
నింగిలో ఉండగలదా?
నేలలో ఆడగలదా అని.

ప్రతిరోజూ పౌర్ణమి
ఎలా సాధ్యం?

ఎవరినీ అడగకు

అదేమిటంటే
విషయాలు ఇక్కడదాకా వచ్చాయి
కాబట్టి రాత్రిశాలలో

విశ్రమించిన సూర్యస్వప్నం
జూలు విదిల్చి కదలగా

ఇక పిల్లలు బడికి వెళ్ళారు
ఇక అతడు పనికి వెళ్ళాడు:

ఎందుకంటే

కథలని మించిన జీవితం
కథలు కాని/కానీ జీవితం

ఏముంది ఎక్కడుంది?

No comments:

Post a Comment